జగిత్యాల:
జగిత్యాల పురపాలక చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎం.ఎల్.ఎ సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె బుధవారం ప్రకటించారు, కంటతడి పెడుతూ తన ఆవేదనను వెలిబుచ్చారు. అడుగడుగునా ఎం.ఎల్.ఎ. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.